శ్రీ సత్య సాయి జిల్లా
హిందూపూర్ మున్సిపల్ పరిధిలోని శ్రీకంఠపురంలో(9 వార్డ్) తాగునీటి సమస్య పై ఖాళీ బిందెలతో ప్రధాన రహదారి పై నిరసన వ్యక్తం చేసిన మహిళలు.
ఈ సందర్భంగా గత 15 రోజులుగా బోరు చెడిపోవడంతో తాగునీటి సరఫరా స్తంభించిందని మహిళలు వాపోయారు, తమ ప్రాంతాలకు నీరు రావడంలేదని మున్సిపల్ కమిషనర్ కు చెప్పినప్పటికీ ఏమాత్రం పట్టించుకోలేదన్నారు.
స్థానిక వాటర్ మ్యాన్ ను అడిగితే మీకు ఇష్టం వచ్చిన వారికి చెప్పుకోండిని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
మున్సిపాలిటీకి వాటర్ టాక్స్ కడుతున్నప్పటికీ ఇటు నివాసాలకు అటు పబ్లిక్ కొళాయిలుకు గాని నీ రు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు.
అధికారుల నిర్లక్ష్య కారణంగా తాగునీటి సమస్య ఎదురయిందని ఒక్కసారిగా ఆ ప్రాంతం మహిళలందరూ కాళీ బిందెలు తీసుకొని ప్రధాన రహదారిపై గంట పాటు బైఠాయించడంతో రాకపోకలు స్తంభించాయి.
ఈ విషయం పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి విచ్చేసి సమస్యను అడిగి తెలుసుకుని తాగునీటి సమస్య పరిష్కారానికి మార్గం చూస్తామని హామీ ఇవ్వడంతో నిరసన కార్యక్రమం నిర్మించారు