జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వి మాధవ్ రెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు
కౌంటింగ్ అనంతరం కూడా గ్రామాల్లో ఎటువంటి అల్లర్లు, గొడవలు, చెలరేగకుండా ప్రజలు శాంతియుతంగా ఉండాలని ప్రజలకు తెలియజేశారు
గ్రామాలలో పోలీసు అధికారులు గ్రామసభలు నిర్వహించారు. ఎన్నికల నిబంధన ప్రకారం కౌంటింగ్ అనంతరం ఎవరూ కూడా ర్యాలీలు , డీజే లు ఊరేగింపులు నిర్వహించకూడదని తెలిపారు
నియమాలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందని పోలీసులు హెచ్చరించారు
సాయంత్రం రోడ్లపై పోలీసులు వచ్చి వాహనాలను తనిఖీలు చేశారు.
బహిరంగ ప్రదేశాలలో మద్యం వంటివి సేవించకూడదని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ పోలీసులు తెలియజేసే నిబంధనలు తప్పక పాటించాలని గ్రామ ప్రజలకు సూచించారు.