ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో


మచిలీపట్నం: ఏపీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎవరైనా అలజడులు సృష్టిస్తే జైలుకు పంపుతామని సీఈవో ముకేశ్కుమార్ మీనా అన్నారు. మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆయన
పరిశీలించారు

ఈ సందర్భంగా మాట్లాడుతూ కౌంటింగ్
కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు.
కట్టుదిట్టమైన భద్రత కోసం సీఆర్పీఎఫ్ బలగాలు పహారా కాస్తాయని వెల్లడించారు. ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలు చేయకూడదని పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్లపై
గెజిటెడ్ సంతకం సడలింపుపై వచ్చిన ఫిర్యాదుపై స్పష్టత ఇచ్చామన్నారు.

Leave a Comment