ధర్మవరం మీదుగా రెండు ప్రత్యేక రైళ్లు
వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ ధర్మవరం మీదుగా రెండు రైళ్లను నడుపుతోంది. యశ్వంతపూర్ నుంచి కాచిగూడ మీదుగా గయకు (06217/18) రైలు శనివారం వెళ్తుంది
మరో రైలు యశ్వంతపూర్ నుంచి విజయవాడ మీదుగా హౌరా(02864/63) మధ్య వారానికి ఒక రోజు నడుస్తుంది
రద్దీ దృష్ట్యా ఈ రెండు రైళ్లు ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి

వీటిని జూన్ తర్వాత కూడా కొనసాగించాలని ప్రయాణికులు కోరుతున్నారు.