బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ లను అమ్మేస్తున్నారు

దేశ దర్మం కోసం బిజెపి మన బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ లను అమ్మేస్తున్నారు అమ్మకానికి బీఎస్‌ఎన్‌ఎల్‌-ఎంటీఎన్‌ఎల్‌ ఆస్తులు  దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఆస్తులు.  వివిధ రాష్ర్టాల్లో 530కిపైగా భవనాలు, భూములున్నట్టు గుర్తించిన టెలికం శాఖ.   ఢిల్లీ, ముంబైల్లో మాత్రమే ఎంటీఎన్‌ఎల్‌కు ఆస్తులు. అయినప్పటికీ ప్రధాన ప్రాంతాల్లోనే చాలా ప్రాపర్టీలు.    ఢిల్లీలో 48, మహారాష్ట్రలో 52 ఆస్తులను కలిగి ఉన్న ఎంటీఎన్‌ఎల్‌.     దేశవ్యాప్తంగా 600లకుపైగా భూములు, భవనాలను గుర్తించిన కేంద్రం    ఆసక్తి ఉన్నవారి కోసం వెబ్‌సైట్‌ తెచ్చామన్న టెలికం … Read more

జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలపై నిషేధం: డిజిపి హరీష్ గుప్తా

జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలపై నిషేధం: డిజిపి హరీష్ గుప్తా ఆంధ్ర ప్రదేశ్: కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్ట మైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని డీజీపీ హరీశ్ గుప్తా వెల్లడించారు. జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాల ను నిషేధించాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని హోటల్స్, లాడ్జీలలో తనిఖీలు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలనూ ఎప్పటికప్పుడు … Read more

జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వి మాధవ్ రెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు

జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వి మాధవ్ రెడ్డి ఐపీఎస్  ఆదేశాల మేరకు కౌంటింగ్ అనంతరం కూడా   గ్రామాల్లో ఎటువంటి అల్లర్లు, గొడవలు,  చెలరేగకుండా ప్రజలు శాంతియుతంగా ఉండాలని ప్రజలకు తెలియజేశారు గ్రామాలలో  పోలీసు అధికారులు  గ్రామసభలు నిర్వహించారు. ఎన్నికల నిబంధన ప్రకారం కౌంటింగ్ అనంతరం ఎవరూ కూడా ర్యాలీలు , డీజే లు ఊరేగింపులు నిర్వహించకూడదని తెలిపారు నియమాలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందని పోలీసులు హెచ్చరించారు సాయంత్రం రోడ్లపై పోలీసులు వచ్చి వాహనాలను తనిఖీలు … Read more

కౌంటింగు రోజున కట్టుదిట్టమైన భద్రతకు సిద్ధమైన పోలీసులు

కౌంటింగు రోజున కట్టుదిట్టమైన భద్రతకు సిద్ధమైన పోలీసులు అల్లరి మూకలను చెదరగొట్టేందుకు వినియోగించే ఆయుధాలు, సామాగ్రిని జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పరీక్షించిన పోలీసులు సార్వత్రిక ఎన్నికల కౌంటింగు రోజు కట్టుదిట్టమైన భద్రతలో భాగంగా పోలీసులు వినియోగించే ఆయుధాలు, పరికరాల సంసిద్ధతను జిల్లా ఎస్పీ గౌతమిశాలి IPS  ఈరోజు తనిఖీ చేశారు. శాంతిభద్రతలు విఘాతం కలిగేలా ఏవైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నప్పుడు లేదా అల్లర్లు, ఘర్షణలు తలెత్తిన సందర్భాలలో సద్దుమణిచేందుకు మరియు అల్లరి మూకలను చెదరగొట్టేందుకు వాడే … Read more

అయ్యప్ప భక్తులకు శుభవార్త

అయ్యప్ప భక్తులకు శుభవార్త మాస పూజకు రోజుకు 50 వేల మంది భక్తులను వర్చువల్ క్యూ ద్వారా దర్శనానికి అనుమతించాలని శబరిమల ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా టికెట్లను ఆన్లైన్లో కేటాయించనున్నామని, క్యూ ద్వారా దర్శనం చేసుకునే అయ్యప్ప భక్తులకు ఇన్సూరెన్స్ పాలసీని అందించనున్నామని అధికారులు తెలిపారు. ఇన్సూరెన్స్ పాలసీ కోసం బుకింగ్ సమయంలో భక్తుల నుండి కేవలం రూ.10వసూలు చేయనున్నామని వెల్లడించారు.

టాటూతో బ్లడ్ క్యాన్సర్ ముప్పు

టాటూతో బ్లడ్ క్యాన్సర్ ముప్పు శరీరంపై వేసుకొనే టాటూలతో లింఫోమా అనే బ్లడ్‌ క్యాన్సర్‌ వచ్చే ముప్పు 21 శాతం వరకూ ఉంటుందని స్వీడన్‌ పరిశోధకులు తెలిపారు లింఫోమా బ్లడ్‌ క్యాన్సర్‌ బారినపడిన 2,938 మందితో కలిపి మొత్తంగా 11,905 మందిపై ఈ అధ్యయనం చేశారు. టాటూలు వేసుకోని వారితో పోలిస్తే, వేసుకొన్న వారిలో క్యాన్సర్‌ కణాల వృద్ధి ఎక్కువ వేగంగా జరిగినట్టు పరిశోధకులు తేల్చారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు.

రవాణశాఖలో జూన్ 1 నుంచి కొత్త రూల్స్ మైనర్లు పట్టుబడితే 25,000 జరిమానా

రవాణశాఖలో జూన్ 1 నుంచి కొత్త రూల్స్..మైనర్లు పట్టుబడితే 25,000 జరిమానా.. జూన్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రానుండగా, భారీగా జరిమానాలు విధించనున్నారు. అతివేగంతో వాహనం నడుపుతూ పట్టుబడితే రూ. 1000 నుంచి రూ.2000వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.500 జరిమానా వేస్తారు. మైనర్ వాహనం నడిపితే రూ.25వేలు ఫైన్ వేస్తారు. దాంతో పాటు మైనర్కి 25 ఏళ్ల వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందకుండా … Read more

హింసాత్మక ఘటనలకు తావులేకుండా జిల్లా ఎస్పీ గౌతమిశాలి IPS

జిల్లాలో హింసాత్మక ఘటనలకు తావులేకుండా కౌంటింగు రోజున పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా ఎస్పీ గౌతమిశాలి IPS

చట్ట వ్యతిరేక, అసాంఘిక శక్తుల ఏరివేత కోసమే కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు

అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమిశాలి IPS

జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్ల పరిధిల్లో ఈరోజు ఆరు చోట్ల కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లు నిర్వహించిన పోలీసులు

ఇదివరకే కేసులు ఉండటంతో పాటు ఈ ఎన్నికలలో ఘర్షణలకు పాల్పడిన 09 మందిపై రౌడీషీట్లు ఓపెన్

సమస్యలు సృష్టించే వీలున్న వారు, చెడు నడత కల్గిన వారిపై ముందస్తు చర్యలులో భాగంగా 795 మందిపై  బౌండోవర్లు

కౌంటింగు వేళ ఎలాంటి అల్లర్లు, ఘర్షణలకు వెళ్లొద్దని… ప్రశాంతంగా మెలగాలని సూచిస్తూ  141 మంది ట్రబుల్ మాంగర్స్, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లకు కౌన్సెలింగ్

ప్రజల్లో ధైర్యం నింపడం… పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం పెంచడానికి 12 చోట్ల ఫ్లాగ్ మార్చ్ లు

అల్లర్లు, ఘర్షణలు జోలికెళ్లకుండా ప్రజలలో చైతన్యం తేవడానికి 12 చోట్ల గ్రామసభలు

జిల్లా ఎస్పీ గౌతమి శాలి ఐపీఎస్

కౌంటింగు రోజున హింసాత్మక ఘటనలకు తావులేకుండా పటిష్ట బందోబస్తు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోండి

జిల్లా ఎస్పీ గౌతమిశాలి IPS

జిల్లాలోని ఎస్సై, ఆపై స్థాయి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఎస్పీ

జిల్లాలో హింసాత్మక ఘటనలకు తావులేకుండా కౌంటింగు రోజున పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా ఎస్పీ గౌతమిశాలి IPS  ఆదేశించారు

జిల్లాలోని ఎస్సై, ఆపై స్థాయి అధికారులతో ఎస్పీ  తన క్యాంపు కార్యాలయం నుండీ ఈరోజు జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రస్తుతం కొనసాగుతోన్న భద్రతా చర్యలను సమీక్షించారు

కౌంటింగు రోజున ఎలాంటి చర్యలు చేపట్టాలో దిశానిర్ధేశం చేశారు. కార్యాచరణ ప్రణాళికలతో జిల్లాలో ఎక్కడా శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన బందోబస్తు చేపట్టాలన్నారు

ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రౌడీషీటర్లు, కిరాయి హంతకులు, చెడునడత కల్గిన వారిని, సమస్యలు సృష్టించే ట్రబుల్ మాంగర్స్ ను ఎవర్నీ వదలకుండా ముందస్తు చర్యలులో భాగంగా బౌండోవర్లు చేయించాలన్నారు

ఇదివరకే కేసులు ఉండి ఇటీవల జరిగిన ఎన్నికలలో ఘర్షణలకు దిగిన వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేయాలని ఆదేశించారు. ఫ్యాక్షన్ ప్రభావిత సమస్యాత్మక గ్రామాల్లో పోలీసు పికెట్లు పటిష్టంగా నిర్వహించి ఆయా గ్రామాల్లోని తాజా పరిస్థితులపై సమాచారం సేకరించి తగు చర్యలు తీసుకోవాలన్నారు

ఫ్లాగ్ మార్చ్ లు, కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు, వాహనాల తనిఖీలు, గ్రామసభలు నిర్వహించడం విస్తృతం చేయాలన్నారు. డ్రోన్లు వినియోగించి ఫలితాలు వెల్లడయ్యాక విజయోత్సవ ర్యాలీలు నిర్వహించే వారిపై చట్టపరంగా చర్యలు చేపట్టాలన్నారు

144 సెక్షన్ తు.చ తప్పకుండా అమలు చేయాలని… ఐదుగురి కంటే మించి గుమిగూడితే ఉల్లంఘనల కింద చట్టపరంగా ముందుకెళ్లాలని సూచించారు. ఎన్నికల  పోటీ అభ్యర్థుల నివాసాలు, పరిసరాలలో భద్రతా చర్యలు తీసుకోవడంతో పాటు సిసికెమేరాల పర్యవేక్షించాలన్నారు.

కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్ధిక సహాయం ఎస్పీ శ్రీ మాధవరెడ్డి

కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేత…. జిల్లా పోలీస్ కార్యాలయంలో  AR కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల మృతి చెందిన చంద్రా నాయక్   కుటుంబానికి 50,000  రూ  రూపాయల చెక్కు ను అందజేసిన ఎస్పి శ్రీ ఎస్వీ.మాధవ్ రెడ్డి ఐపీఎస్ A R కానిస్టేబుల్ గా విధులు  నిర్వహిస్తూ,11-4-24  గుండెపోటుతో  మృతి చెందిన AR  కానిస్టేబుల్  చంద్ర నాయక్   కుటుంబానికి ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఎస్పి ఛాంబర్ నందు వారి  సతీమణి శాంతమ్మకు,జిల్లా ఎస్పీ … Read more

రెంటచింతల: ఏజెంట్లపై దాడి కేసులో 12 మందికి రిమాండ్

రెంటచింతల: ఏజెంట్లపై దాడి కేసులో 12 మందికి రిమాండ్

పల్నాడు జిల్లా, రెంటచింతల మండలంలోని రెంటాలలో ఈ నెల 13న ఏజెంట్లపై దాడి కేసులో 12 మందిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ ఎం. ఆంజనేయులు ఆదివారం తెలిపారు.

దాడిలో గాయపడిన చేరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, చేరెడ్డి మంజుల, గొంటు నాగమల్లేశ్వరరెడ్డి, చేరెడ్డి రఘురామిరెడ్డిల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

12 మందిని గురజాల జూనియర్ సివిల్ జిడ్జి ముందు హాజరు పరచగా, వారికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్ఐ తెలిపారు.