ఏపీలో కింగ్ మేకర్లు మహిళలే

ఏపీలో కింగ్ మేకర్లు మహిళలే !

తమదే అధికారం అంటూ క్షేత్రస్థాయికి సంకేతాలు పంపుతున్న ఇరు పార్టీలు

ఏపీలో రిజల్ట్ చెప్పడానికి సాహసం చేయలేని సెఫాలజిస్టులు, ఏజెన్సీలు

ఓ పార్టీ అధినేతను బొమ్మరిల్లు ఫాదర్ గా మార్చిన 2024 ఎన్నికలు

ఆ సామాజిక వర్గానికి సింగిల్ లీడర్ గా ఓ పార్టీ అధినేతను నిలబెట్టిన వైనం

సర్వశక్తులు ఎదురొడ్డి పోరాడాడన్న పేరు సంపాదించిన మరో పార్టీ అధినేత

అమరావతి : ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలను అంచనా వేయడం కష్టంగా మారింది

గెలుపు పై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ వారి అంతరంగంలో ఉన్న గుబులు మాత్రం అలాగే ఉంటుంది

పేరు మోసిన సెఫాలజిస్టులు, ఏజెన్సీలు, విశ్లేషకులు సైతం ఏపీలో ఫలితాలను, గెలుపు అంచనాలను
ధైర్యంగా ప్రకటించేంత సాహసం చేయలేకపోతున్నారు

విశ్వసనీయతకు, అబద్ధపు హామీలకు మధ్యనే ఈ ఎన్నికలు జరిగాయని ప్రజలంతా గత ఐదేళ్లుగా చెప్పిన మాటను చెప్పినట్లుగా నిలబెట్టుకుంటున్న తమ పార్టీకి పట్టం కడతారని అధికార వైకాపా ధీమావ్యక్తం చేస్తోంది

మరోవైపు నియంతృత్వాన్ని నియంత స్వభావాన్ని కొనసాగిస్తున్న జగన్ పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, “ప్రభుత్వ వ్యతిరేక ఓటు” తమ సాంప్రదాయ ఓటు బ్యాంకుకు కలసి వచ్చి, అధికారం చేపట్టబోతున్నామని ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం మరియు కూటమి తమ విజయవకాశాలను గట్టిగానే విశ్వసిస్తున్నారు

అయితే ఈ ఎన్నికలు ఆయా పార్టీల అధినేతల తీరు తెన్నులను ప్రజాక్షేత్రంలో స్పష్టం చేశాయని చెప్పవచ్చు

చెప్పినవి చేశాం! చెప్పనివి చేశాం! అనే నినాదంతో ఎన్నికల బరిలోకి ధైర్యంగా సిద్ధమై వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయగలిగింది. అయితే ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత అనుసరించిన విధానాలు, వ్యూహం పరిశీలిస్తే


ఎక్కడా ఎలాంటి పొత్తులు లేకుండా సింగిల్ గా ఎన్నికల బరిలోకి దిగారు.. అదేవిధంగా ప్రచారాన్ని కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింగిల్ గానే కొనసాగించారు. 2019 ఎన్నికలలో జగన్ కుటుంబ సభ్యులందరూ ప్రచారంలో రోడ్డుమీద ఉండగా

ఈ ఎన్నికలలో కేవలం ఒకే ఒక్క నినాదంగా అధినేత జగన్
పేరు మాత్రమే వినపడింది. పైగా తాను నమ్మిన ఐప్యాక్ బృందం వ్యూహం తప్ప, వేరే ఎవరికీ ఎక్కడా ఎలాంటి ఇతర వ్యూహం లేకుండా, ఏ దశలోనూ అస్పష్టత లేకుండా, తన కనుసన్నల్లోనే మొత్తం ఎన్నికల ప్రక్రియను జగన్ నిర్వహించగలిగారు

అభ్యర్థులకు సునాయాసంగా, అదనపు ఒత్తిడి లేకుండా ఈ వ్యూహం ఎంతో మద్దతుగా నిలిచినప్పటికీ, వారి మదిలో తమ అధినేతను బొమ్మరిల్లు ఫాదర్ గా నిలిపాయనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు

మరోవైపు “ప్రభుత్వ
వ్యతిరేక ఓటు చీల్నివ్వను” అనే ఏకైక నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన జనసేన పార్టీ కూటమి ఏర్పాటులో కీలక భూమిక వహించింది. 2019లో రాష్ట్రంలో ఒకే ఒక్క సీటు మాత్రమే సొంతం చేసుకున్న ఈ పార్టీ, 2024 ఎన్నికలలో మాత్రం కీలకంగా మారింది

పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఉన్న ప్రేక్షకాదరణను రాజకీయ ఆదరణగా మార్చుకోవడంలో, తన సామాజిక వర్గం నుండి అత్యధిక శాతం మద్దతును కూడగట్టడంలో విజయం సాధించగలిగారని చెప్పవచ్చు

ఇంకా చెప్పాలంటే ఆ సామాజిక వర్గ మొత్తానికి సింగిల్ లీడర్ గా, ఐకానిక్ పర్సనాలిటీగా ఈ ఎన్నికలు ఆయనకు గుర్తింపు తెచ్చి, గతం కంటే మెరుగ్గా నిలబెట్టాయని తెలుస్తోంది.

ఏడు పదుల వయసులో కూడా ఒక రాజకీయ పార్టీకి సంపూర్ణ సారధ్యం వహించడం, కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికల బరిలో తన పూర్తి సామర్థ్యంతో పని చేశారనే
ఖ్యాతిని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంతం చేసుకున్నారు.

మొత్తం ఎన్నికల ప్రక్రియలో తన అనుభవసారాన్ని, కూటమి మద్దతును పూర్తిగా వినియోగించి అధికార పార్టీకి గట్టి పోటీని ఇవ్వగలిగారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటును పూర్తిగా తమకు అనుకూలంగా మలుచుకోవాలనే సందేశాన్ని, అధికారంలోకి వస్తామని విశ్వాసాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లగలిగారు.

ఇక అసలు విషయానికొస్తే ఈ ఎన్నికలలో నిజమైన “కింగ్ మేకర్స్” గా నిలుస్తుంది రాష్ట్రంలోని మహిళా ఓటర్లు మాత్రమే!

ప్రతిసారి ఎన్నికలలో మహిళా ఓట్లే కీలకం అనే నానుడి ప్రచారంలో కొనసాగుతున్నప్పటికీ, ఈ ఎన్నికల్లో మాత్రం “అధికార కిరీటం” ఎవరిని వరించాలనే అంశం పూర్తిగా వారి నిర్ణయాన్ని బట్టే ఉంటుంది.

ఎవరికి వారు తమ సర్వశక్తులను ఎదురొడ్డి ఎన్నికల బరిలో తమ ప్రతాపాన్ని ప్రదర్శించారు.

అయితే ఎవరి సంప్రదాయ ఓటు బ్యాంకు వారికే బలంగా నిలవనుండగా, అధికార అందలాన్ని ఎక్కించే కీలక ఓటు మాత్రం మహిళల చేతిలోనే ఉందని స్పష్టమవుతోంది

ఓటింగ్ సరళిని పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు బాహాటంగా పోలింగ్ కు హాజరై గతంలో కంటే మెరుగ్గా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పురుష సమాజం రెండుగా చీలిపోయి, ఎవరు ఏ పార్టీకి మద్దతుగా నిలిచారనే విషయం దాదాపుగా స్పష్టం అవుతున్న వేళ, మహిళా ఓటు మాత్రం అత్యంత గోప్యంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు 2014 ఎన్నికలలో ఇదే కూటమి అధికారం సాధించిన నేపథ్యంలో, అధికార పార్టీపై మహిళల్లో ఏ మాత్రం వ్యతిరేకత ఉన్నా,అది ప్రతిపక్షానికి బలంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

రుణమాఫీకి సర్వం సిద్ధం.. డిసెంబర్ 9 కటాఫ్ ?

రుణమాఫీకి సర్వం సిద్ధం.. డిసెంబర్ 9 కటాఫ్ ?

TG: రాష్ట్రంలో రుణమాఫీకి డిసెంబర్ 9 కటాఫ్ తేదీగా ప్రభుత్వం ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15లోగా రుణమాఫీ కానుంది

కుటుంబానికి రూ.2 లక్షలు మాఫీ చేయనున్నారు. రూ.2 లక్షల కంటే ఎక్కువుంటే మిగతాది చెల్లించాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే అన్నీ కలిపి లెక్కించనున్నారు

బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న అప్పు కూడా మాఫీ కానుంది. దీర్ఘకాలిక రుణాలకు మాత్రం మాఫీ వర్తించదని టాక్

సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్

విజయవాడ:

సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడి సతీష్ బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్..

నిందితుడు సతీష్ పిటిషన్పై విజయవాడలోని 8వ అదనపు జిల్లా కోర్టులో వాదనలు..

సతీష్ కుమార్ తరపున కోర్టులో వాదనలు వినిపించిన న్యాయవాది సలీం..

సతీష్ కుమార్ను పోలీసులు అక్రమంగా ఈ కేసులో ఇరికించారన్న సలీం..

సతీష్ బెయిల్ పిటిషన్పై రేపు ఆర్డర్స్ ఇవ్వనున్న న్యాయమూర్తి..

ఏపీలో ఫలితాలపైనే ఉత్కంఠ నెలకొంది

ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి జరిగిన భారీ పోలింగ్ నేపథ్యంలో ఫలితాలపైనా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా గతంతో పోలిస్తే పెరిగిన పోలింగ్ శాతం, రాష్ట్రం బయట ఉన్న వారు భారీగా వచ్చి పోలింగ్ లో పాల్గొనడం

వైసీపీ, కూటమికి మధ్య జరిగిన హోరాహోరీ పోరు నేపథ్యంలో ఫలితాలపై ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఇవాళ ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈసారి ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీలు 8 వేల కోట్లు, 6 వేల కోట్ల చొప్పున ఖర్చు పెట్టాయని రఘువీరారెడ్డి వెల్లడించారు. వారితో పోటీ పడి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లలో గెలిచే పరిస్ధితి లేదన్నారు

కాంగ్రెస్ ఈసారి డబ్బు ప్రభావం పనిచేయని రెండు, మూడు సీట్లలో గెలిచే అవకాశం ఉందన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఎంపీ సీట్లలో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు భావిస్తున్నట్లు రఘువీరా తెలిపారు.

అలాగే ఈసారి ఎన్నికల్లో ఎవరికీ గాలి లేదని రఘువీరా తెలిపారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 2009 రిపీట్ అవుతుందేమో అనిపిస్తోందన్నారు

అప్పటి ఎన్నికల్లోనూ తమకు నామమాత్రపు సీట్లతో మెజార్టీ వచ్చిందన్నారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని భావిస్తున్నట్లు తెలిపారు

అయితే ఏ పార్టీ ఇలా బయటపడుతుందో మాత్రం ఆయన చెప్పలేదు.గెలిచే వారికి మాత్రం 95-97 సీట్లే వస్తాయన్నారు. అలాగే 100 మంది ఎమ్మెల్యేలకు మెజార్టీ 10 వేల లోపే ఉంటుందన్నారు. కచ్చితంగా ఇది క్లోజ్ ఫైట్ అన్నారు.

ఏపీలో ఈసారి ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా

ఏపీలో ఈసారి ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా ?

వెస్ట్ గోదావరి :

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం, ఉంగుటూరు, పోలవరం నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది

ఈ సెంటిమెంట్ గత 46ఏళ్లుగా వస్తోంది. అందుకే అందరి చూపు ఈ నాలుగు నియోజక వర్గాల పైనే ఉంది.

మరి ఈ ఎన్నికల్లో 46ఏళ్ల సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? లేక అంచనాలను తలకిందులు చేస్తూ సెంటిమెంట్ కు బ్రేక్ పడనుందా?  అనేది తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే

వెస్ట్ గోదావరి జిల్లాలో భారీ మెజార్టీతో టిడిపి గెలుస్తుందని అంచనాలు ఉన్నాయి

ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కి నివాళులర్పించిన,కాంగ్రెస్ నాయకులు ఎం.హెచ్.ఇనాయ తుల్లా,నాయకులు కార్యకర్తలు

ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కి నివాళులర్పించిన,కాంగ్రెస్ నాయకులు ఎం.హెచ్.ఇనాయ తుల్లా, నాయకులు కార్యకర్తలు రాజీవ్ గాంధీ 1944 నాలుగులో జన్మించారు. ఈయన భారతదేశానికి ఆరో ప్రధానమంత్రిగా దేశానికి ఎంతో విశిష్ట సేవలు అందించారు. అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రిగా ఈయన భారతదేశానికి సేవలు అందించడం జరిగింది. శ్రీలంక దేశానికి చెందిన తమిళ తీవ్రవాదులు చేసిన మానవ బాంబు దాడిలో ఈయన మరణించడం జరిగింది. ఈయన మరణం ప్రపంచానికే తీరని లోటని ఏకంగా ఇప్పటికీ ఆయన … Read more

నందమూరి తారకరత్న భార్య అలేఖ్య ఓటు టిడిపికే..

దివంగత నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.ఏపీ ఎన్నికల్లో భాగంగా ఆమె సపోర్టు చేసే పార్టీ ఏదో తేల్చేశారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సందర్భంగా ఈ ఎన్నికల్లో అలేఖ్యా రెడ్డి సపోర్టు చేసే పార్టీ ఏదో ఇన్డైరెక్ట్గా వెల్లడించారు. కాగా తారకరత్న మరణాంతరం ఆయన బదులుగా అలేఖ్యా రెడ్డి ఎమ్మెల్యే పోటీ చేస్తారంటూ గతంలోకి వార్తలు వచ్చాయి. … Read more

జగనన్న స్పందించుకుంటే- వైయస్సార్ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేపడతాం-: హిందుపురం బి బ్లాక్ కన్వీనర్ నరేష్

జగన్ కోసం ఊపందుకున్న సంతకాల ఉద్యమం-హిందూపురం నుండి జగన్ పోటీ చేయాలి- ప్రజల ఆశయాల కోసం జగన్ హిందూపురం నుండి పోటీ చేయాలి– లేదా హిందూపురం అభివృద్ధిపై మాట ఇవ్వాలి జగన్ స్పందించుకుంటే- వైయస్సార్ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేపడతాం-: బి బ్లాక్ కన్వీనర్ నరేష్ గత 5సంవత్సరాలుగా సీఎం జగన్ మోహన్ రెడ్డి కులమత పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి అందరి మదిలో నిలిచారని అయితే స్థానిక అధికార … Read more

దిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టైన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తిహాడ్‌ జైల్లో ఓ చిన్న (14×8 అడుగుల విస్తీర్ణం) గదిలో విచారణ ఖైదీగా

దిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టైన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తిహాడ్‌ జైల్లో ఓ చిన్న (14×8 అడుగుల విస్తీర్ణం) గదిలో విచారణ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. జైలు నంబర్‌ 2లో ఉన్న ఆయన.. ధ్యానం, యోగాతోపాటు పుస్తకాలు చదవుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రోజులో రెండుసార్లు ధ్యానం, యోగా చేస్తున్న కేజ్రీవాల్‌ ఎక్కువ సమయం పుస్తకాలతోనే గడపుతున్నట్లు తెలిపాయి. టీవీ ఉన్నప్పటికీ.. ఉదయం, సాయంత్రం గంటన్నరపాటు ఆయన యోగా, ధ్యానం చేస్తున్నారు. … Read more

ఆమెకు బెయిల్ ఇవ్వొద్దన్న ఈడీ- కొడుకు పరీక్షల నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలన్న కవిత తరపు న్యాయవాది

ఆమెకు బెయిల్ ఇవ్వొద్దన్న ఈడీ- కొడుకు పరీక్షల నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలన్న కవిత తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ పై విచారణ ముగించిన స్పెషల్ కోర్టు ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితే సూత్రధారి అని, అందుకే ఆమె బెయిల్ అప్లికేషన్ను వ్యతిరేకిస్తున్నామని ఈడీ తరపు న్యాయవాది జోహెబ్ హౌస్సేన్ కోర్టుకు తెలిపారు. అవినీతి కార్యకలాపాల్లో ఉన్న మహిళకు బెయిల్ ఇవ్వకూడదని వాదించారు. అయితే కొడుకు పరీక్షల నేపథ్యంలో కవితకు బెయిల్ ఇవ్వాలని ఆమె తరపు … Read more