గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి

అప్పులు మొత్తం

రాష్ట్ర ప్రభుత్వం సావనీర్ గ్యారెంటీ ఇచ్చి తెచ్చిన అప్పులు మొత్తం

ఎన్నికల అనంతరం కాంట్రాక్టర్లకు చెల్లించిన బిల్స్ వివరాలు

ప్రభుత్వ ఉద్యోగులు ఇతర ప్రావిడెంట్ ఫండ్స్ నుండి మరియు ఆర్థిక సంస్థల నుండి తెచ్చిన అప్పుల వివరాలు

ప్రభుత్వ ఉద్యోగులకు TA,DA బకాయిలు ఎంత ఉన్నవి

ప్రతి సంవత్సరం రీపేమెంట్ కు అసలు ప్లస్ వడ్డీ కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఎంత కట్టవలసి ఉంది

సివిల్ సప్లయర్స్ కార్పొరేషన్కు, డిస్కం లకు, పవర్ సప్లయర్స్ లకు చెల్లించవలసిన బకాయిలు ఎంత ఉన్నవి .

ఈ సంవత్సరంలో వివిధ సంక్షేమ పథకాలకు
నిధులు రిలీజ్ చేయవలసి ఉన్నప్పటికీ, అతికొద్ది మాత్రమే ఇచ్చి మొత్తం రిలీజ్ చేసినట్లుగా ప్రకటనలు చేస్తున్నారు

బట్టన్ నొక్కిన వారికి కూడా పాక్షికంగా చెల్లించిన విధానం

ఈ విధంగా ఈ సంవత్సరం సంక్షేమ పథకాలకు ఎంత నిధులు చెల్లించవలసి ఉన్నది.

రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్ని కేసులు ఉన్నవి .

కోర్టులు తీర్పు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం అమలుపరచకుండా కంటెంప్ట్ కేసులు ఎన్ని ఉన్నవి…

గవర్నర్  ని కలసి న వారి లో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రాశివన్నారాయణ, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, బిజెపి మీడియా రాష్ట్ర ఇంఛార్జి పాతూరి నాగభూషణం, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, రాష్ట్ర అధికార ప్రతినిధి లు యామినీ శర్మ, ఆర్ డి విల్సన్
బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం, బిజెపి సీనియర్ నేత కిలారు దిలీప్ , జగదీష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment