ఏపీలో రేపు పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధం

T MAHESH

ఏపీలో రేపు పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధం


అమరావతి:జూన్ 30
ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద చేపట్టే సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ రేపు ప్రారంభంకానుంది.

తొలిరోజే 100 శాతం పంపిణి పూర్తిచేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సీఎస్ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు.

ఉదయం 6 గంటల నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభిం చాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫించన్ల పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే, కఠినచర్యలు తప్పవని సీఎస్ హెచ్చరించారు.

లబ్ధిదారులకు ఇళ్ల వద్దే పింఛన్లను అందించేందుకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితోపాటు ఇతర శాఖలకు చెందిన క్షేత్రస్థాయి ఉద్యోగులను వినియోగిం చుకోవాలని సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా రేపు ఏపీలో జరగనున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన నున్నారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమా కలో ఉదయం 6 గంటలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది.

అనంతరం జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో పింఛను లబ్ధిదారులు, ప్రజలతో సీఎం ముచ్చటించను న్నారు. రాష్ట్రంలో ఒకే రోజు 65 లక్షల 18వేల 496 మంది లబ్ధిదారులకు 4వేల 408 కోట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

పింఛన్ల పంపిణీ కార్యక్ర మంలో సీఎంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొనున్నారు.

Leave a Comment