ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కి నివాళులర్పించిన,
కాంగ్రెస్ నాయకులు ఎం.హెచ్.ఇనాయ తుల్లా, నాయకులు కార్యకర్తలు
రాజీవ్ గాంధీ 1944 నాలుగులో జన్మించారు. ఈయన భారతదేశానికి ఆరో ప్రధానమంత్రిగా దేశానికి ఎంతో విశిష్ట సేవలు అందించారు. అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రిగా ఈయన భారతదేశానికి సేవలు అందించడం జరిగింది. శ్రీలంక దేశానికి చెందిన తమిళ తీవ్రవాదులు చేసిన మానవ బాంబు దాడిలో ఈయన మరణించడం జరిగింది.
ఈయన మరణం ప్రపంచానికే తీరని లోటని ఏకంగా ఇప్పటికీ ఆయన చేసిన సేవలు చరిత్రపుటల్లో నిలిచిపోయాయి. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే విధంగా ఆయన అభిమానులు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు.
ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎం హెచ్. ఇ నాయ తుల్లా అదే విధంగా సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ రవుప్ ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా అభిమానులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె ఈ సందర్భంగా ఎంహెచ్. ఈ నాయ తుల్లా మాట్లాడుతూ దేశానికే వన్నెతెచ్చిన ప్రధాన మంత్రిగా రాజీవ్ గాంధీ నిలిచిపోవడం జరిగిందన్నారు. భారతదేశ కోసం ఇందిరా గాంధీ కుటుంబం త్యాగం చేసిందన్నారు. కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు నెహ్రూ కుటుంబాన్ని ఆదర్శ కుటుంబంగా తీసుకొని ముందుకెళ్లాలున్నారు.
అదేవిధంగా ఈరోజు జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం గా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అన్నారు. ఏది ఏమైనా ప్రధానమంత్రి గా రాజీవ్ గాంధీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి నేడు భారతదేశ ఔన్నత్యాన్ని దశదిశల వ్యాప్తి చెందడానికి రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు